టిఎన్జీవో ఆధ్వర్యంలో నూతన అధికారులకు ఘన సన్మానం

0
18

ఉదయక్రాంతి:- తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో నూతన బాధ్యతలు చేపట్టిన అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) పి చంద్రయ్య కు, జిల్లా వ్యవసాయ అధికారి భూక్యా ఛత్రు నాయక్ లకు టిఎన్జీవో ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. వికారాబాద్ జిల్లా నుండి బదిలీపై జిల్లాకు విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) పి చంద్రయ్య కు,    కరీంనగర్ జిల్లా నుండి బదిలీపై జిల్లా వ్యవసాయ అధికారిగా నూతన బాధ్యతలు చేపట్టిన భూక్యా ఛత్రు నాయక్ లను జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలుపుతూ, ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి కొరకు తమ వంతు కృషి చేస్తామన, ప్రజలకు శాఖపరమైన సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షులు రామ్ కుమార్, తిరుపతి, సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శులు గోపాల్, అజయ్, సూపరింటెండెంట్  వసంత కుమార్, గంగారం సభ్యులు కార్తీక్, అజయ్, వెంకటస్వామి లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి