
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందించిన కళాశాల చైర్మన్ పల్లె భూమేష్
ఉదయక్రాంతి:- రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలలో మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని శ్రీ హర్ష జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి, విజయకేతనం ఎగురవేశారు. ప్రకటించిన ఫలితాలలో బైపిసి ప్రథమ సంవత్సరం లో రంగు సంజన 432/440, రాగోల నీతు 430/440 , ఎంపిసి లో నిమ్మతి స్పందన 454/470, సిఈసి లో అంజుమ్ 477/500, ఆరీభ ఈశాల్ ఎంపీసి 434/470, లక్కం సాగరిక 433/470, శనిగారపు దివ్యశ్రీ 427/470, బైపిసి లో దుర్గం శిరీష 407/440, సిఈసి లో గడ్డం నిత్యశ్రీ 448/500, కురిసింగ హిరణ్య రావు 417/500 ఎంపిహెచ్డబ్యు లో దండేరా రాజేశ్వరి 476/500, ఎంఎల్టి లో ఆకునూరి అమూల్య 467/500 ఎంపిహెచ్డబ్యు ద్వితీయ సంవత్సరంలో పంబాల వర్ష 955/1000 , ఏసీపి ద్వితీయ సంవత్సరంలో మానేపల్లి రాజేశ్వరి 950/100మార్కులను సాధించి, కళాశాల కీర్తి ప్రతిష్టలను నిలబెట్టారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ పల్లె భూమేష్ మాట్లాడుతూ, విద్యార్థులు రానున్న రోజులలో మంచి ఫలితాలను సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాలలో విద్యనభ్యసించిన మరెందరో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల పల్లె భూమేష్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ పోటు మనోహర్ రెడ్డి , తనుగుల శ్రావణ్ ప్రిన్సిపాల్ ఆరె లావణ్య,డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనిత ఠాకూర్ పాల్గొని విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.