

విలేకరుల సమావేశంలో వినయ్ భార్య
ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన నస్పూరి వినయ్ ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందగా, అతని మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుని భార్య నస్పూరి భాగ్యలక్ష్మి, కుటుంబ సభ్యులు కోరారు. మందమర్రి పట్టణ ప్రెస్ క్లబ్లో బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, తన భర్త వినయ్ ఆత్మహత్య చేసుకోవడానికి వోడ్నాల శ్రీనివాస్, అతని భార్య వోడ్నాల మమత లు ప్రేరేపించారని ఆరోపించారు. తన భర్త వినయ్ ను మమత తన వలలో వేసుకొని, తతంగం నడిపించిందని, దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలు తన వద్ద ఉన్నాయని తెలుపుతూ, వాటిని విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టింది. వోడ్నాల శ్రీనివాస్ అతని మిత్రులు నరేందర్, సురేందర్, రాజిరెడ్డి అనే వ్యక్తులు పలుమార్లు తన భర్త వినయ్ పై దాడి చేశారని ఆరోపించింది. దీంతో తన భర్త మానసికంగా తీవ్ర ఆవేదన చెందాడని, ఈ నేపథ్యంలోనే పలుమార్లు ఆత్మహత్యయత్నం చేసుకున్నాడని వివరించింది. వారి వేధింపులు ఆగకపోవడంతో గత నెల తన భర్త వినయ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. వినయ్ మృతికి కారుకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మంచిర్యాల రైల్వే పోలీస్ స్టేషన్ లో సైతం ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపింది. కానీ విచారణ పేరిట రైల్వే ఎస్ఐ సాక్ష్యులను ఇష్టం వచ్చినట్టు తిట్టినట్లు ఆరోపిస్తూ, రైల్వే పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసును రైల్వే పోలీసుల నుండి పట్టణ పోలీసులకు బదిలీ చేయాలని కోరింది. తనకు న్యాయం జరగకుంటే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని స్పష్టం చేశారు.


