back to top

వైద్యుల నిర్లక్ష్యానికి కడుపు కోతకు గురైన ఆదివాసీ కుటుంబం

Date:

కారణమైనవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి
  
ఉదయక్రాంతి :- మంచిర్యాల జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని జిల్లా మాత శిశు ఆసుపత్రికి ప్రసవం కోసం బుధవారం వచ్చిన నెన్నల మండలం మైలారం గ్రామానికి చెందిన గావిడి సుమలత కు సకాలంలో వైద్యం అందించకపోవడంతో నిండు గర్భిణిగా ఉన్న సుమలత కడుపులోనే శిశువు మరణించడం జరిగిందని, ఈ సంఘటనకు బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని సిపిఎం బృందం శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా సంకె రవి మాట్లాడుతూ, రెండు రోజులుగా బాధితురాలు,కుటుంబ సభ్యులు వైద్యులను ఎంత వేడుకున్న కనికరం చూపించలేదని, చివరికి శుక్రవారం ఆపరేషన్ చేసి, కడుపులో చనిపోయిన శిశువును తీసి, కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. చనిపోయిన శిశువును పట్టుకొని, కుటుంబ సభ్యులు ఇక్కడనే ఉంటే గొడవలు జరగడంతో పాటు తమ నిర్లక్ష్య దోరణి బయటపడి, ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయోననే భయంతో మరణించిన శిశువును ఇతర కుటుంబ సభ్యులతో దహన సంస్కారణలకు ఇంటికి పంపించడం జరిగిందన్నారు. తొలి కాన్పుతో బిడ్డ కోసం ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ఆనందం వైద్యుల నిర్లక్ష్యం మూలంగా గాలిలో కలిసిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈసంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్ కుమార్, ఐఆర్సిపి నాయకులు కామిల్లా జయరావ్ లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...