back to top

సమ్మక్క సారలమ్మ లకు మొక్కులు చెల్లించిన ఏరియా జిఎం

Date:

సింగరేణి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఆర్కే 1ఏ సమీపంలో గల సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు గురువారం ఏరియా జిఎం జి దేవేందర్ మొక్కులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు ప్రతి రెండు సంవత్సరాలకు జరిగే జాతరలో భాగంగా ఈ సంవత్సరం యధావిధిగా మొక్కులు చెల్లించడం జరిగిందని తెలిపారు. అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా సింగరేణి ఉద్యోగులపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రతాప్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, ఆర్కేపీ ఉపాధ్యక్షుడు ఇప్పకాయల లింగయ్య, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు తిరుపతి గౌడ్, ఏరియా నాయకులు పి బాణయ్య, ఆంటోని దినేష్, సివి రమణ, జెట్టి మల్లయ్య, గాండ్ల సంపత్, సిహెచ్పి శర్మ, మర్రి కుమార్, హరి రామకృష్ణ, గుమ్మడి సంపత్, జువ్వాజి శ్రీనివాస్, ఏరియా ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...