-1700 కేజీల గంజాయి, 64 కేజీల ఆల్పోజోలం దాహనం ..
నిజామాబాద్,బోధన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 154 కేసుల్లో పట్టుబడిన 12 కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి, మత్తు పదార్థాలను గురువారం కాల్చివేశారు.
నిజామాబాద్ డిప్యూటి కమిషనర్ సోమిరెడ్డి డిస్పోజల్ అధికారి ఇచ్చిన అదేశాల మేరకు నిజమాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ కే. మల్లారెడ్డి ఇతర ఎక్సైజ్ యంత్రాంగం నిమాబాద్ జి ల్లా జక్రాన్పల్లిలో ఉన్న ప్రభుత్వ అమోదిత కాల్చివేత కంపెనీ శ్రీ మేడికేర్లో గురువారం గంజాయి, మత్తు పదార్ధాలను కాల్చివేశారు.
కాల్చివేసిన వాటిల్లో 1700.5 కిలోల గంజాయి, 64.27 కిలోల ఆల్పోజోలం, 72.2 కిలోల డైజోఫా మ్, ఒక గంజాయి మొక్కను దహనం చేశారు.
గంజాయి, మత్తు మందులను కాల్చివేసిన నిజామాబాద్ ఎక్సైజ్ అధికారులను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి వారిని అభినందించారు.
