back to top

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

Date:


ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో షేక్ జిలాని (30) అనే యువకుడు మృతి చెందడం జరిగిందని పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏరియా కేకే ఓసిపి లో లారీ డ్రైవర్లు గా పని చేస్తున్న అన్నదమ్ములైన షేక్ ముగ్ధం, షేక్ జిలానీలు ఇరువురు తమ ద్విచక్ర వాహనం (ఏపీ 01క్యూ8743)పై పని నిమిత్తం మంచిర్యాలకు వెళ్లి, తిరిగి వారి మేనమామ ఇంటికి బెల్లంపల్లికి వెళుతుండగా పట్టణ ఫ్లైఓవర్ పైన ద్విచక్ర వాహనం అదుపుతప్పి, కుడివైపు ఉన్న డివైడర్ ను ఢీకొట్టడంతో వాహన నడుపుతున్న షేక్ జిలాని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో షేక్ ముగ్ధం తీవ్ర గాయాలపాలు కాగా అతనిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతుని మేనబావమరిది షేక్ సలీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎస్ రాజశేఖర్ తెలిపారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ఒకే స్థలంలో.. ఒకే దేవతకు… రెండు ఆలయాలు

గందరగోళంలో ముదిరాజ్ కులస్తులురెండో ఆలయ నిర్మాణానికి అనుమతులు ఎక్కడివి...? ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా...