దేశంలో విజృంభిస్తున్న క్యాన్సర్ మహమ్మద్ రాకుండా ప్రజలందరూ ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని జిల్లా సబ్ జడ్జి, న్యాయ సేవ అథారిటీ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి సూచించారు. పట్టణంలోని తవక్కల్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన క్యాన్సర్ నివారణ సదస్సుకు ఆమె, మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ నాగవేణి, చీఫ్ డిఫెన్సి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అడ్వకేట్ ఎండి సంధాని, విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్యాన్సర్ నివారణకు పిల్లలు, పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ, పలు ప్రశ్నలకు సమాధానం తెలిపారు. అనంతరం అర్పిత మారంరెడ్డి మాట్లాడుతూ, సివిల్ కేసుల గురించి వివరిస్తూ, పేదలు, వృద్ధులు, వికలాంగులు, డబ్బులు లేని వాళ్ళు కేసులకు భయపడకుండా ఏ విధంగా కోర్టులో వాదించాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.



