back to top

కిసాన్ అగ్రి షో ను సద్వినియోగం చేసుకోవాలి

Date:

చెన్నూరు ఏడిఏ బానోత్ ప్రసాద్
హైదరాబాద్ నగరంలోని హైటెక్స్ లో ఫిబ్రవరి 7,8,9 న నిర్వహించు కిసాన్ అగ్రి షో-2025 ను మండలం లోని రైతులు సందర్శించి, సద్వినియోగం చేసుకోవాలని చెన్నూరు ఏడిఏ బానోతు ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మండలంలోని పులిమడుగు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, అగ్రి షో లో వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణ ప్రదర్శనను వీక్షించడంతో వ్యవసాయ రంగంలో మరింత అవగాహన పొందవచ్చునని, ఈ వ్యవసాయ ప్రదర్శన సందర్శించడంతో వ్యవసాయం అనుబంధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి గురించి తెలుసుకోవచ్చునని తెలిపారు. అదేవిధంగా నూతన వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనతో పాటు విత్తనాలు, పురుగుల మందులు తదితర వాటిలో నూతన ఆవిష్కరణలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రదర్శనకు రైతులు సొంత ఖర్చుతోనే వెళ్లాలని సూచించారు. అదేవిధంగా మండలంలో నిర్వహించబడుతున్న డిజిటల్ క్రాఫ్ట్ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, కనకరాజు లు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగస్వామ్యం కావాలి

డ్రగ్స్ రహిత సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ హోరాహోరీగా...

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు సాగాలి అంజనీపుత్ర చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండి...

మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్….పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత

ఉదయక్రాంతి:- నాయకత్వం అంటే కేవలం పదవులు, ప్రసంగాలు కాదు, నిజమైన నాయకుడు...

ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుని మృతి

ఉదయక్రాంతి:- మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ ఫ్లైఓవర్ పైన ఆదివారం ద్విచక్ర...